TDPకి కంచుకోటలు ఇవే: ఆంధ్ర ప్రదేశ్ లో స్థానిక ఎన్నికల నేపధ్యంలో ఎవరికి వారు తమ తమ ప్రతాపం చూపించుకోటానికి సిద్ధం అయ్యారు. అయితే స్థానిక పోరులో సహజం గా ఏకగ్రీవాలు అవుతాయి. అవి కూడా అధికారం లో ఉన్న పార్టీలకే ఏకగ్రీవాలు జరుగుతాయి. గతం లో వై.ఎస్.ఎస్. జగన్ అధికారం లో ఉన్నప్పుడు, ఇలాంటి ఏకగ్రీవాలు జరిగాయి. ఇప్పుడు తాజాగా జగన్ మొన్నా మధ్య ప్రెస్మీట్ పెట్టి ఈ సారి ఏక గ్రీవాలు అయితే ఆ నియోజక వర్గం లోని శాసన సభ్యుడి కి లేదా ఇంచార్జ్ కు ఆ తరువాత జరిగే ఎన్నికలలో టికెట్లు ఇవ్వనని తెగేసి చెప్పారు. దీంతో తెలుగుదేశానికి కంచుకోటలైన నియోజక వర్గాలలో వై.సి.పి. అభ్యర్ధులకు భయం పట్టుకుంది. ఇంతకూ తెలుగుదేశానికి కంచుకోటలు ఏమిటి అనేది చూస్తే….
కుప్పం – చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. 1983 నుంచి తెలుగుదేశం పార్టీ వరుసగా గెలుస్తూ వచ్చిన అత్యంత బలమైన కోటల్లో ఇది ఒకటి. 1983లో మాత్రం కుప్పం నుంచి TDP అభ్యర్థి ఎన్. రంగస్వామి నాయుడు విజయం సాధించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఈ నియోజకవర్గాన్ని తన రాజకీయ స్థావరంగా మార్చుకున్నారు.
హిందూపురం – నందమూరి కుటుంబానికి, ట్డ్ఫ్కి దశాబ్దాలుగా బలమైన నియోజకవర్గం. అసెంబ్లీతో పాటు లోక్సభ స్థాయిలోనూ తెలుగుదేశం పార్టీ ప్రభావం కనిపించింది. 1983లో హిందూపురం నుంచి పి. రంగనాయకులు TDP తరఫున విజయం సాధించారు. 1985, 1989, 1994లో ఎన్టీఆర్ ఇక్కడి నుంచి గెలిచారు. 1999, 2004లోనూ TDP అభ్యర్థులు విజయం సాధించారు.
ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ వరుసగా 2014, 2019, 2024 ఎన్నికల్లో TDP తరఫున గెలిచారు. 2024లో ఆయన 1,07,250 ఓట్లు సాధించి విజయం దక్కించుకున్నారు.
ఉరవకొండ – అనంతపురం ప్రాంతంలో తెలుగుదేశం పార్టీకి సాంప్రదాయంగా బలమైన నియోజకవర్గాల్లో ఒకటి. 1983 ఎన్నికల్లోనే ఇక్కడ TDP అభ్యర్థి భీమారెడ్డి వై. విజయం సాధించారు.
అయితే ఇతర నియోజకవర్గాలతో పోలిస్తే ఉరవకొండను పూర్తిగా ఏకపక్ష కంచుకోటగా కాకుండా TDPకి బలమైన సాంప్రదాయ నియోజకవర్గంగా పేర్కొనడం సరైనది.
ధర్మవరం – dharmavaram రాయలసీమలో తెలుగుదేశం పార్టీ కి మంచి క్యాడర్ బేస్ ఉన్న ప్రాంతంగా పరిగణిస్తారు.
మంగళగిరి – mangalagiri లో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ, 2024లో నారా లోకేశ్ విజయం తర్వాత తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఈ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టింది.
Vijayawada East విజయవాడ తూర్పు – విజయవాడ నగరంలో తెలుగుదేశం పార్టీకి బలమైన రాజకీయ స్థావరంగా చాలాకాలంగా గుర్తింపు ఉంది.
విజయవాడ సెంట్రల్ – Vijayawada Central లో తెలుగుదేశం పార్టీ ప్రభావం ఉన్న మరో కీలక నియోజకవర్గం.
పెదన – Pedana కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీ కి సాంప్రదాయంగా మంచి పట్టు ఉన్న ప్రాంతాల్లో ఒకటి.
Gudiwaada, గుడివాడ – ఇక్కడ ఎన్నికలు తరచూ హోరాహోరీగా సాగినప్పటికీ, తెలుగుదేశం పార్టీ కి దీర్ఘకాలిక క్యాడర్ బలం ఉంది.
అనపర్తి / రాజానగరం ప్రాంతాలు – ఉభయ గోదావరి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కి ఉన్న సాంప్రదాయ బలాన్ని ప్రతిబింబించే ప్రాంతాలు.
మరి ఈ లెక్కన చూస్తే కుప్పం నుంచి కె.ఆర్.జె.భరత్, హిందూపురం నుంచి టి.ఎన్.దీపిక, ధర్మవరం నుంచి కేతిరెడ్డి, మంగళగిరి నుంచి లావణ్య, విజయవాడ తూర్పు నుంచి దేవినేని అవినాష్, విజయవాడ సెంట్రల్ నుంచి వెల్లంపల్లి, పెనమలూరు నుంచి జోగి రమేష్, పెడన నుంచి ఉప్పల రాము, గుడివాడ నుంచి కొడాలి నాని, రాజా నగరం నుంచి జక్కంపూడి రాజా, అనపర్తి నుంచి సూర్య నారాయణ రెడ్డి, గన్నవరం నుంచి వల్లభనేని వంశి లాంటి అతిరధ మహారధులు టికెట్లు గల్లెంతేనా?
TDP చరిత్రలో ఓటములు కూడా ఉన్నాయి
TDPకి కంచుకోటలు ఉన్నప్పటికీ పార్టీ అన్ని ఎన్నికల్లోనూ విజయవంతంగా సాగలేదు. 1989లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 2004, 2009లోనూ TDP అధికారానికి దూరమైంది. 2019లో అయితే ఆంధ్రప్రదేశ్లో TDP కేవలం 23 అసెంబ్లీ స్థానాలకే పరిమితమైంది.
2024లో మాత్రం పరిస్థితి పూర్తిగా మారింది. TDP 135 స్థానాలు గెలుచుకుని తిరిగి అధికారంలోకి వచ్చింది.
Finally….
తెలుగుదేశం పార్టీకి ఉన్న బలాన్ని ఒక్క నియోజకవర్గం లేదా ఒక ప్రాంతంతో మాత్రమే కొలవలేం. ఎన్టీఆర్ కాలం నుంచి ఏర్పడిన పార్టీ క్యాడర్, చంద్రబాబు నాయకత్వం, నందమూరి కుటుంబ ప్రభావం, స్థానిక నాయకత్వం కలిసి కొన్ని నియోజకవర్గాల్లో TDPకి ప్రత్యేకమైన పునాది ఏర్పరిచాయి.
అందులో కుప్పం, హిందూపురం మాత్రం TDP చరిత్రలో అత్యంత స్పష్టమైన రాజకీయ కోటలుగా నిలిచాయి. మిగిలిన ప్రాంతాల్లో కాలానుగుణంగా రాజకీయ సమీకరణాలు మారుతూ వచ్చాయి.




