Skip to content
క్రీడలు

7 వ నెంబర్ జెర్సి కనుమరుగై 6 సంవత్సరాలు

మహేంద్ర సింగ్ ధోనీ (ఎం. ఎస్. ధోనీ) భారతీయ క్రికెట్ క్రీడాకారుడు. ఇతను1981 జూలై 7 జన్మించాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్లు భారత జాతీయ క్రికెట్ జట్టు మాజీ సారథి. అటాకింగ్ కుడి చేతివాటం గల మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, వికెట్ -కీపర్…. ధోనీ టెస్టులు, వన్ డే ఇంటర్నేషనల్ లో ఒక భారతీయ కెప్టెన్ అత్యధిక విజయాలతో అనేక కెప్టెన్సీ రికార్డులను, అత్యధిక బ్యాక్ టు బ్యాక్ వన్డేల్లో విజయాల భారతీయ కెప్టెన్. అతను 2007 లో రాహుల్ ద్రావిడ్ నుండి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు. మొట్టమొదటి ద్వైపాక్షిక వన్డే సిరీస్ లోనే జట్టుకు శ్రీలంక, న్యూజిలాండ్ తో పోరాడి విజయం తీసుకవచ్చాడు. తన సారథ్యంలో భారతదేశం 2007 ఐసీసీ ప్రపంచ ట్వంటీ ట్వంటీ, 2007-08 సి.బి సిరీస్, 2010 ఆసియా కప్, 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. 2011 ప్రపంచ కప్ ఫైనల్లో ధోనీ 91 పరుగులతో అజేయంగా నిలిచాడు. అందుకు అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. జూన్ 2013 లో, ఇంగ్లండ్లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారతదేశం ఇంగ్లాండ్ ఓడించడంతో ధోనీ మూడు ఐసిసి పరిమిత ఓవర్ల ట్రోఫీలు (ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ ట్వెంటీ 20) గెలుచుకున్న మొదటి కెప్టెన్ అయ్యాడు. 2008 లో టెస్ట్ కెప్టెన్సీ చేజిక్కించుకున్న తర్వాత, అతను న్యూజిలాండ్, వెస్ట్ ఇండీస్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2008, 2010, 2013 లో విజయం సాధించిపెట్టాడు. 2009 లో ధోనీ మొదటి సారి భారత్ ను ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో మొదటి స్థాననికి తీసుకవెళ్ళాడు. 2013 లో, అతని సారథ్యంలో, భారతదేశం 40 సంవత్సరాల తరువత ఒక టెస్ట్ సీరీస్లో ఆస్ట్రేలియాను వైట్వాష్ చేసింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో, అతను చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 2010, 2011 సీజన్లలో, ఛాంపియన్స్ లీగ్ ట్వంటీ ట్వంటీ 2010, 2014 సీజన్లలో సారథిగా కప్పు సాధించిపెట్టాడు ఇటీవల అజింక్య రహానే తన రిటైర్మెంట్‌పై సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టాడు. ఆటకు వీడ్కోలు పలుకుతున్నానని చెప్పాడు. అంతకుముందు కూడా కొందరు ప్లేయర్లు ఇలానే చెప్పారు. విరాట్, రోహిత్ అయితే టీ20, టెస్టులకు గుడ్‌బై చెప్పేశారు. కానీ, పెద్దగా ప్రచారం కోరుకోని ధోని (ంశ్ ఢొని) మాత్రం ఓ ఆసక్తికరమైన పోస్టుతో తన నిర్ణయాన్ని ప్రకటించాడు. అమితాబ్‌ బచ్చన్ నటించిన కభికభీ సినిమాలోని సాంగ్‌ను బ్యాక్‌గ్రౌండ్‌లో పెట్టాడు. ‘‘ఇవాళ రాత్రి 19:29 గంటల నుంచి అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్మెంట్‌ తీసుకున్నట్లు పరిగణనలోకి తీసుకోండి’’ అని 2020 ఆగస్టు 15న అభిమానుల కోసం పోస్టు పెట్టాడు. డిసెంబర్ 2019లో బోరియా మజుందార్‌తో ఓ షోలో ధోని ఆ పాటను రెండు లైన్లు పాడటం విశేషం. ఫేర్‌వెల్ లేకుండానే.. సాధారణంగా ఎవరైనా ప్లేయర్‌ తాము అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలుగుతున్నామని జట్టు మేనేజ్‌మెంట్‌కు చెప్పడం సహజం. ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ను ఆడించి ఘనమైన వీడ్కోలు పలకడం ఆనవాయితీ. కానీ, ధోని మాత్రం ఇలాంటివి కోరుకోలేదు. భారత్‌ తరఫున తన చివరి మ్యాచ్‌ను 2019 జులైలో ఆడాడు. దాదాపు 13 నెలల తర్వాత అంటే 2020 ఆగస్టు 15న ఆటకు గుడ్‌బై చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ‘‘మాట కాదు.. పనే మాట్లాడాలి’ అన్నట్లుగా ధోని (ఢొని ఋఎచొర్ద్స్) సాధించిన ఘనతలు ఎప్పటికీ నిలిచిపోతాయి. 90 వండే మాచ్లే కావచ్చు, 3 సెంచిరీలే కావచ్చు, 16 అర్ధ సెంచిరీలే కావచ్చు, 2648 పరుగులే కావచ్చు కాని మూడు ఐసీసీ ట్రోఫీలను నెగ్గిన సారథి.. భారత జట్టును ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన కెప్టెన్‌. వికెట్ కీపర్‌గానూ చురుకైన పాత్ర. మరి ఇలాంటి ప్లేయర్‌కు ఎంతటి ఘనమైన వీడ్కోలు అందాలి. కానీ, అవేవీ తనకు అవసరం లేదని భావించాడీ ‘కెప్టెన్ కూల్‌’ (ఛప్తైన్ ఛూల్). అంతర్జాతీయంగా తన ‘7’వ నంబర్‌ జెర్సీకి చడీచప్పుడు లేకుండా గుడ్‌బై చెప్పేసి ఆరేళ్లైనా ఇప్పటికీ ‘ధోని’ ఘనతలను మరువలేం. అదీనూ భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజునే వీడ్కోలు చెప్పడం విశేషం.

Women’s T20 Asia Cup 2026: పాకిస్థాన్‌తో భారత్ ఢీ.. ఫేవరెట్‌గా టీమిండియా

england vs Pakistan: పాకిస్థాన్ పేసర్ల దెబ్బకు ఇంగ్లండ్ విలవిల.. తొలి రోజే 9 వికెట్లు
Studio One News

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *