Skip to content
వార్తలు

Idupu Kayitham: ‘శ్రీలత’ సాంగ్‌కు అదిరిపోయే రెస్పాన్స్.. సురేష్ బొబ్బిలి, అలరాజు హ్యాపీ

‘ఇడుపు కాయితం’లో ‘శ్రీలత’ సాంగ్‌కు మంచి స్పందన.. సురేష్ బొబ్బిలి, అలరాజు హ్యాపీ

ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతున్న ‘ఇడుపు కాయితం’ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘శ్రీలత’ పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని చిత్ర బృందం తెలిపింది. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై రూపొందుతున్న ఈ చిత్రానికి వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు.

ఫోక్ సాంగ్స్‌తో గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ హీరోయిన్‌గా నటిస్తోంది. ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో ఎంటర్‌టైనింగ్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సంగీతానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందని మేకర్స్ చెబుతున్నారు.

తాజాగా జరిగిన ఇంటర్వ్యూలో సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, గీత రచయిత అలరాజు ‘శ్రీలత’ పాటకు వస్తున్న స్పందనపై సంతోషం వ్యక్తం చేశారు.

‘శ్రీలత’ పాటలో నటించిన సురేష్ బొబ్బిలి

సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ ‘శ్రీలత’ పాట తన కుటుంబ సభ్యులతో పాటు సినీ పరిశ్రమకు చెందిన పలువురికి నచ్చిందన్నారు. పాట కంపోజిషన్, సౌండింగ్, లిరిక్స్, గాయకుల ప్రదర్శనపై ప్రశంసలు వస్తున్నాయని తెలిపారు.

ఈ పాటలో తాను కూడా నటించడం ప్రత్యేక అనుభవమని చెప్పారు. సంగీత దర్శకుడిగా ఎన్నో పాటలు చేసినప్పటికీ ప్రేక్షకులకు తనను మరింత దగ్గరగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో నిర్మాత బన్నీ వాస్ సూచన మేరకు పాటలో కనిపించినట్లు వెల్లడించారు.

ఒకే రోజులో ట్యూన్, లిరిక్స్ ఫైనల్

‘శ్రీలత’ పాటను సినిమా కథలో భాగంగా ఉండటంతో పాటు ప్రమోషన్‌కు కూడా ఉపయోగపడేలా డిజైన్ చేశామని సురేష్ బొబ్బిలి తెలిపారు.

ట్యూన్, లిరిక్స్ ఒకే రోజులో ఫైనల్ అయ్యాయని చెప్పారు. పూర్తిగా తెలంగాణ ఫోక్ శైలికే పరిమితం చేయకుండా, అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువయ్యేలా మెలోడీ, కమర్షియల్ టచ్ కలిపినట్లు వివరించారు.

Weekly Horoscope: వార ఫలాలు 13 సెప్టెంబర్ నుంచి 19 సెప్టెంబర్ 2026 వరకు | ఈ వారం ఏ రాశికి అదృష్టం?

పాటలో తెలంగాణ ప్రాంతంలో వాడుకలో ఉన్న కొన్ని పదాలను అలరాజు ఉపయోగించడం వల్ల సాహిత్యానికి ప్రత్యేకమైన flavour వచ్చిందని అన్నారు.

ఆరు పాటలు.. మ్యూజిక్‌కు ఎక్కువ స్కోప్

‘ఇడుపు కాయితం’లో మొత్తం ఆరు పాటలతో పాటు కొన్ని బిట్ సాంగ్స్ కూడా ఉంటాయని సురేష్ బొబ్బిలి తెలిపారు.

సినిమాలో ప్రతి పాట కథకు అనుగుణంగా వస్తుందని, పెళ్లి ఎపిసోడ్, కొత్త జంట గ్రామానికి వెళ్లే సందర్భం వంటి సన్నివేశాల్లో సంగీతానికి మంచి స్కోప్ ఉందన్నారు.

తెలంగాణ నేపథ్యం ఉన్నప్పటికీ పాటలు అన్ని ప్రాంతాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా రూపొందించినట్లు చెప్పారు.

“ఈ పాట నాకు మంచి గుర్తింపు తెచ్చింది”

గీత రచయిత అలరాజు మాట్లాడుతూ తాను ఇప్పటివరకు దాదాపు 40 సినిమాలకు పాటలు రాశానని తెలిపారు.

‘మైల్స్ ఆఫ్ లవ్’ చిత్రంలోని ‘తెలియదే తెలియదే’, ‘బాపు’ సినిమాలోని ‘కంగారే పడకురా’ పాటలు తనకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయని చెప్పారు.

‘శ్రీలత’ పాట విడుదలైన తర్వాత ప్రముఖ గీత రచయిత కాసర్ల శ్యామ్ నుంచి ప్రశంసలు రావడం ఎంతో ఆనందాన్నిచ్చిందన్నారు.

Chandrababu Naidu: IT Man to Water Man:

పాటలోని కొన్ని లైన్లు, ముఖ్యంగా టైటిల్ ‘ఇడుపు కాయితం’ భావాన్ని సాహిత్యంలో మేళవించిన తీరు బాగుందని కాసర్ల శ్యామ్ అభినందించినట్లు తెలిపారు.

సినిమాలో చూస్తే మరింత కనెక్ట్ అవుతుంది

‘శ్రీలత’ పాట కథలో హీరోహీరోయిన్లు హైదరాబాద్‌కు వచ్చిన సందర్భంలో వస్తుందని అలరాజు వెల్లడించారు.

శ్రీలత ఎందుకు అలిగింది? శ్రీనివాస్ ఆమెను ఎలా బుజ్జగించాడు? అనే సందర్భంలో పాట వస్తుందని చెప్పారు. కేవలం ఆడియోగా వినడమే కాకుండా సినిమాలో చూసినప్పుడు ఈ పాట మరింత బాగా కనెక్ట్ అవుతుందని తెలిపారు.

రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్స్‌కు దూరంగా, కొత్త పదాలతో సాహిత్యం రాయడానికి ప్రయత్నించినట్లు చెప్పారు.

‘శ్రీలత’ పాట తనకు మంచి గుర్తింపును తీసుకొచ్చిందని, ‘ఇడుపు కాయితం’ గీత రచయితగా తన ప్రయాణంలో ప్రత్యేకమైన సినిమాగా నిలుస్తుందని అలరాజు పేర్కొన్నారు.

‘ఇడుపు కాయితం’ గురించి

ప్రియదర్శి, నాగదుర్గ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘ఇడుపు కాయితం’ను వంశీరెడ్డి దొండపాటి దర్శకత్వం వహిస్తున్నారు. బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై ఈ చిత్రం రూపొందుతోంది. కుటుంబ కథాంశం, తెలంగాణ నేపథ్యం, వినోదం, సంగీతం ప్రధాన ఆకర్షణలుగా సినిమా ఉండనుందని చిత్ర బృందం తెలిపింది.

Studio One News

తాజా అప్‌డేట్ల కోసం మా WhatsApp ఛానల్‌ను ఫాలో అవ్వండి

Follow our WhatsApp Channel for Latest News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *