‘పిఠాపురంలో… అలా మొదలైంది’పై రాజేంద్రప్రసాద్ ఆసక్తికర వ్యాఖ్యలు.. సెప్టెంబర్ 18న విడుదల
టాలీవుడ్లో మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ తదితరులు కీలక పాత్రల్లో నటించిన ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ సినిమా సెప్టెంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ‘ప్రేయసి రావే’ ఫేమ్ మహేష్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 18న సినిమా విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటుడు సుమన్ సినిమా టీజర్ను…